L Subbarayudu: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు.

0
90

ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

 

సభలు, ఊరేగింపులకు తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి పొందాలని సూచన

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ - 30ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఒక నెల కాలవ్యవధికి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని పోలీసు శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

 

ఫిబ్రవరి నెలలో తిరుపతి జిల్లా పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభల నిర్వహణపై నియంత్రణలు అమల్లో ఉంటాయి. ప్రజా ప్రదేశాల్లో సభలు లేదా ఊరేగింపులు నిర్వహించదలచిన వారు తప్పనిసరిగా ముందస్తుగా సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. దరఖాస్తులో సభ లేదా ర్యాలీ నిర్వహించే ప్రదేశం, తేదీ, సమయం వంటి వివరాలు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే వివాహాలు, అంత్యక్రియలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు. 

 

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ -1861తో పాటు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు, సంఘాలు, సంస్థలు ఈ ఆదేశాలను గౌరవించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం
నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.  ...
By Rajini Kumari 2025-12-27 10:29:47 0 151
Andhra Pradesh
గాలివీడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ గాలివీడు అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గాలివీడు మండలం ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-02-28 05:32:54 0 134
Andhra Pradesh
మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-02-18 10:22:18 0 171
Andhra Pradesh
గ్రీవెన్స్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే::
కర్నూలు:  గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించి...
By Hari Krishna 2025-12-26 16:18:38 0 156
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com