Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.

0
91

వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక

 

ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి

24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ

అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.

 

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, "బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్.     బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...
By Sidhu Maroju 2025-09-14 11:08:55 0 240
Andhra Pradesh
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మొదటి దశగా
కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆస్పరి మండలంలోని ఏ.జి రోడ్డు నుంచి శంకరబండ, చిప్పగిరి మండలంలోని...
By mahaboob basha 2025-10-24 14:47:22 0 224
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను...
By Kothuru Murali 2026-03-30 11:51:12 0 68
Andhra Pradesh
పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్....
By Kothuru Murali 2026-01-12 08:41:36 0 121
Telangana
నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
 నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo...
By Sadaq Sadaq 2026-03-03 08:31:27 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com