ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!

0
182

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ సమీకరణాలు  వేగంగా మారుతున్నాయి.

మల్కాజిగిరి  ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలు బిజెపిలో చేరారు. 

మూడు చింతలపల్లి మండల మాజీ అధ్యక్షుడు నందాల శ్రీనివాస్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా  కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ నరసింహారావు తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంక గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెంకగళ్ల అనూష,  తదితరులు బిజెపిలో చేరారు.

గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నేతలు, కె. నర్సింగారావు, కె. అశోక్, కె. సుధాకర్, కె. భూపాల్, జె. బాల నరసింహ, ఏ. అశోక్, ఏ. బిక్షపతి రాజు, జి. జంగాలు, ఎస్. వెంకటస్వామి, జె. రమేష్ సహా, పలువురు కార్యకర్తలు, ఈటెల రాజేందర్ నాయకత్వంపై  నమ్మకంతో బిజెపి పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా,  ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బిజెపి బలపడుతోందని, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని, ఆశాభావం వ్యక్తం చేశారు. 

 ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు, పి. సురేందర్ రెడ్డి, ఎస్. మల్లేష్ యాదవ్, ఏ. ఆనంద్, మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju.

Alwal 

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Cabinet Approves Medical Tourism, Green Energy & Urban Policies
On July 15, Rajasthan’s State Cabinet led by CM Bhajan Lal Sharma approved three...
By Bharat Aawaz 2025-07-17 07:24:18 0 2K
Telangana
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ...
By Ponnala Srinivasrao 2026-05-23 02:17:07 0 130
Andhra Pradesh
నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక...
By Patan Khuddus 2026-07-06 16:53:56 0 95
Andhra Pradesh
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2026-03-09 17:23:45 0 172
Telangana
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-11-26 07:49:05 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com