ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|

0
125

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని అల్వాల్ పోలీసులు స్పష్టం చేశారు. 

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజిగూడలో రోడ్డు ప్రమాదాల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ, ప్రశాంత్, లాండ్ అండ్ ఆర్డర్ (L&O) విభాగం సిబ్బంది వాహనదారులకు స్థానిక ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పై విపులంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం మితిమీరిన వేగంతో వెళ్లకపోవడం వంటి అంశాలను గురించి వివరించారు. 

నిబంధనలను అతిక్రమిస్తే ఎదురయ్యే ప్రమాదాలను సోదాహరణంగా వివరిస్తూ వాహనదారులలో చైతన్యం నింపారు. "మీ భద్రతే మా ప్రాధాన్యత" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 

తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత కూడా తమపై ఉందని వాహనదారులతో  ఎస్ హెచ్ ఓ  ప్రతిజ్ఞ చేయించారు..

 

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
By Benguluri Madhubabu 2026-01-22 04:32:02 0 230
Andhra Pradesh
విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం...
By Gadiyapudi Narendra 2026-02-12 17:22:04 0 159
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 2K
Andhra Pradesh
శివాలయంలో స్టోరీ
పుంగనూరు: కట్టకింద శివాలయంల ో సీస ీ కెమెరాలు ధ్వంసం చేస ి చోరీక ి పాల్పడిన గుర్తు తెలియని...
By Kothuru Murali 2025-12-27 17:26:22 0 151
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com