Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!

0
113

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించనున్న సీఎం 

సాయంత్రం 4 గంటలకు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించనుంది. అలాగే ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. 

 

అధికార వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చేరుకుని అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించి, పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. 

 

అనంతరం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న, నూతనంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న రైల్వే పనులను వేగవంతం చేయాలని అధికారులకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. రోజంతా వరుస సమీక్షలు, అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 6.45 గంటలకు సీఎం తన నివాసానికి తిరిగి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 39
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు
ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గుంటూరు.    గుంటూరులో యువతకు సందేశాన్ని ఇచ్చారు.
By KOTESWARARAO KVSR 2025-12-23 10:48:01 0 133
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 245
Andhra Pradesh
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు
అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు  పలు సమస్యలు గుర్తించి,పై...
By Chennaiah Kati 2026-03-13 14:24:50 0 275
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com