నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు...

0
118

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు.

ఎస్సై లక్మి కాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీ పాల్పడుతున్న నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను,తయారీ ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు,తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ అక్రమ ధనార్జన ధ్యేయంగా FK పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్, ధర్మవరం శివారున జంతువుల కొవ్వు,క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి,ఇచ్చాపురంకి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్,యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ ,రాజమండ్రికి చెందిన యం డి ఇఫ్రాన్ లతో ఒప్పందం కుదుర్చుకొని గత నాలుగు నెలలుగా ఆప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. 

నిందితుడితో పాటు మరో 8మంది ఈ అక్రమ దందాలో కొనసాగుతున్నారని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని అన్నారు..

ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై లక్ష్మీకాంతం మరియు సిబ్బంది ని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు.

ప్రజలు నకిలీ పదార్థాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. #Dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
మామను రాయితో కొట్టి చంపిన అల్లుడు
పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి...
By Kothuru Murali 2026-01-05 12:48:33 0 83
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 147
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 06:18:08 0 64
Andhra Pradesh
ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.
ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల...
By Chennaiah Kati 2026-02-04 06:17:16 0 89
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*   *పత్రికా ప్రకటన* *తేదీ....
By Rajini Kumari 2026-02-02 17:13:02 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com