కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...

0
217

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఇటు ప్రభుత్వం, అటు ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు.. నేలకొండపల్లి వాసులు.. కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని  గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరం, ఆడిటోరియంతో పాటు భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని నిర్మించారు కానీ జయంతి ఉత్సవాలను మరిచారు. అప్పుడప్పుడు సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు. కానీ నేడు జరుగుతున్న రామదాసు జయంతి ఉత్సవాల తీరు పట్ల నేలకొండపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లా లో డిప్యూటీ ముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే కనీసం ఉన్నతాధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ అటు వైపు కన్నెత్తి కూడా చూడ లేదంటే ఉత్సవాలు ఏవిధంగా జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతోంది. అధికారులు, నిర్వహాకుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
Search
Categories
Read More
Andhra Pradesh
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక...
By Ratna Sekhar 2026-02-11 14:26:06 0 45
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 120
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 39
Andhra Pradesh
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి!! కర్నూలు ఎస్పీ
కర్నూలు : పత్రికా ప్రకటన (24.12.2025)కర్నూలు జిల్లా...క్రిస్మస్,  న్యూ ఇయర్ వేడుకలు...
By Hari Krishna 2025-12-24 14:22:31 0 140
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com