Vijayasai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.

0
161

ఏపీ మద్యం స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

హైదరాబాద్‌లో దాదాపు 7 గంటల పాటు సాగిన విచారణ

ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఈడీ అధికారులు

రూ. 3,500 కోట్ల కుంభకోణం ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు

కేసులో మరికొందరు నేతలను విచారించే అవకాశం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను గురువారం నాడు సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని పంపించారు.

 

ఈడీ నోటీసుల మేరకు ఉదయం విచారణకు హాజరైన విజయసాయి రెడ్డిని అధికారులు పలు కోణాల్లో విచారించారు. గత ప్రభుత్వ మద్యం విధానం, విక్రయాలు, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర వంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు విచారణ ముగించారు.

 

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీని ద్వారా సుమారు రూ. 3,500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు.

 

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు నేతలు, మధ్యవర్తులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి...
By Hari Krishna 2025-12-15 12:03:37 0 257
Business & Finance
Low Rainfall Raises Concerns for Jharkhand's Kharif Economy
A significant monsoon rainfall deficit has delayed paddy cultivation across several districts in...
By Navya Sree 2026-07-04 08:08:01 0 54
Andhra Pradesh
ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!!!!!!!!!!!!!!!!!!!!!!!
కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్‌ డిపోనకు చెందిన...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:24:22 0 247
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 187
SURAKSHA
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 06:40:50 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com