రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావు.

0
154

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గం మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.

సమాచార హక్కు చట్టం – 2005 ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టమని పేర్కొన్న ఆయన, ప్రజలకు సమాచారంపై హక్కు కల్పించడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

రాష్ట్ర సమాచార కమిషన్ ఒక స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థగా పనిచేస్తుందని, చట్టాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడు అడిగే సమాచారం చట్టబద్ధంగా ఉంటే, అతనికి అది తప్పకుండా అందేలా చూడటం కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు.

RTI చట్టం అధికారులను భయపెట్టే చట్టం కాదని, పాలనలో విశ్వసనీయతను పెంచే సాధనంగా దీన్ని చూడాలన్నారు. సమాచార అధికారులు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా అవగాహన కల్పించడంపై కూడా కమిషన్ దృష్టి సారిస్తుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 142
Chandigarh
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
By Bharat Aawaz 2025-07-17 06:05:48 0 2K
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 98
Andhra Pradesh
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి మండిపల్లి
ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన...
By Benguluri Madhubabu 2026-01-23 06:10:29 0 207
Andhra Pradesh
పుంగనూరు: కృష్ణా జలాలకు పూజలు చేసిన రైతులు
మంగళవారం పుంగనూరు మండలంలోని మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-03-20 05:41:07 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com