Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.

0
125

రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప 

రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచన

ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమ డిఫాల్ట్ బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, నిందితులకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ట్రయల్ కోర్టేనని స్పష్టం చేసిన ధర్మాసనం, నాలుగు వారాల గడువు ఇస్తూ ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

మద్యం కేసు నేపథ్యం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘జే బ్రాండ్’ పేరుతో ప్రజలను నిలువుదోపిడి చేశారని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశించింది.

 

 

దీంతో అప్పటి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు కాగా, పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే కొందరు నిందితులకు బెయిల్ లభించగా, మరికొందరు ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంకొందరు నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
By Rajini Kumari 2026-01-09 10:19:46 0 145
Andhra Pradesh
గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.
Kvsr. Koteswararao. Guntur   *గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది:...
By KOTESWARARAO KVSR 2026-01-09 16:13:14 0 432
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్న కర్నూల్ ఇంచార్జ్ డీఐజీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... డిఐజి, ...
By Hari Krishna 2026-01-06 00:06:44 0 193
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటన
ఏప్రిల్ 25వ  తేధిన తాన పార్టిని ప్రకటిన్‌చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి...
By Sadaq Sadaq 2026-03-27 13:54:21 0 143
Telangana
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:06:06 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com