గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

0
218

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమీక్షించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో పెచ్చులు ఊడి పడుతున్నాయని, మరుగుదొడ్ల కొరత ఉందని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా పట్టాభిపురం హై స్కూల్ వద్ద గంజాయి బ్యాచ్ అధికంగా ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరగా, గంజాయి బ్యాచ్‌ను ఉపేక్షించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చరవాణిలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.

ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, ఆయన స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పాఠశాలలన్నింటిలో సమస్యలను పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించి, విద్యార్థులకు ఉత్తమ విద్య అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్,: సఫారీ ఏరియాలో 'వని దర్శిని'
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికల భాగంగా పాత మంచిర్యాల్ సెక్షన్ పరిధిలోను సఫారీ ఏరియా లో స్థాన యువత,...
By Bonagiri RaviShankar 2026-06-04 17:10:23 0 169
Business & Finance
Heavy Rains Disrupt Mumbai Business Operations
Heavy rainfall and an India Meteorological Department (IMD) orange alert have disrupted...
By Navya Sree 2026-06-30 06:54:54 0 100
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 222
Andhra Pradesh
చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్
**చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్*   *త్రాగునీటి కొరత రాకుండా...
By Rajini Kumari 2026-06-01 12:27:27 0 143
Andhra Pradesh
మరోసారి ప్రవేశ రుసుము చెల్లించిన ఎమ్మెల్యే నారా లోకేష్
*మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!*   *-మరోసారి ప్రవేశరుసుం చెల్లించిన మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-27 10:49:35 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com