జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

0
134
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
తమ సమస్యలను విన్నవించుకున్న 36 మంది అర్జీదారులు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వరకట్న వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు తదితర పలు సమస్యలతో మొత్తం 36 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ గారు అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ.
మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం...
By Pagadala Venkateswar 2026-01-31 07:47:48 0 102
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 117
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 103
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com