ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
157

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ₹. 60.000 విలువైన చెక్కును లబ్ధిదారుడు రాజుకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అందాల్సిన ఫలాలు సకాలంలో చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆపదలో ఉన్న కుటుంబానికి తో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు  అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా  త్వరితగతిన సహాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS
*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️‍♂️🏌️‍♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ,...
By Rajini Kumari 2025-12-21 08:49:02 0 212
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 110
Andhra Pradesh
Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి.
మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి...
By Pagadala Venkateswar 2026-01-22 10:44:33 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com