విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి

0
325

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం కాదని, ప్రజలకు అండగా నిలిచే వ్యవస్థ అనే భావనను నాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడ్ని చూస్తూ తాను ఎదిగానని, ఈ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మంత్రి అనిత పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. తెలుగు ప్రజల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Meghalaya
Meghalaya Streamlines Governance via Admin Reshuffle
The Meghalaya government has initiated a significant administrative restructuring to enhance...
By Lokeshwari Panthadi 2026-07-02 06:20:17 0 65
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 149
Chandigarh
Chandigarh Strengthens Healthcare and Public Services
Chandigarh has undertaken several measures to enhance healthcare infrastructure and public health...
By Fathima Safa 2026-06-25 11:21:23 0 108
SURAKSHA
WB Police Improve Traffic Flow in Busy Cities
Managing dense urban traffic is a daily challenge that the West Bengal Police handles with...
By Kalaga Sailaja 2026-06-27 08:23:52 0 78
Andhra Pradesh
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం...
By Mobbu Venkatramana 2026-03-18 14:26:59 0 407
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com