విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి

0
329

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం కాదని, ప్రజలకు అండగా నిలిచే వ్యవస్థ అనే భావనను నాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడ్ని చూస్తూ తాను ఎదిగానని, ఈ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మంత్రి అనిత పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. తెలుగు ప్రజల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Strengthens Agriculture and Farmer Welfare
Maharashtra continues to prioritize agriculture and farmer welfare through initiatives that...
By Fathima Safa 2026-07-06 08:21:23 0 98
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 287
Andhra Pradesh
గుంటూరు కలెక్టర్ ఆదేశాలు ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలి
 15 నాటికి అన్ని కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానం అమలు చేయాలి గుంటూరు, డిసెంబర్ 23:- జనవరి 15...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:13:11 0 201
Andhra Pradesh
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు దర్శి,...
By Chennaiah Kati 2026-07-11 13:25:23 0 58
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభం
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-30 08:43:17 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com