పెనమలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన బోడే ప్రసాద్

0
73

పెనమలూరు నియోజవర్గం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా తానే రక్తదానం చేసి ప్రారంభించారు తరాలు మారిన యుగాలు మారిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నాడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 

 

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా పోరంకి సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాను రక్తదానం చేసి శిబిరాన్ని లాంఛినంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు అనుములు ప్రభాకర్ రావు కంకిపాడు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ అన్ని ధన రామకోటేశ్వరరావు ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని అలాంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా గత 20 సంవత్సరాలుగా పెనమలూరులో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఎన్టీఆర్ వర్ధంతి జయంతి ల సందర్భంగా పెనమలూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని భవిష్యత్తులో కూడా ఆ మహనీయుని వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Goa
गोव्यात होणार 'सुपर कप' फुटबॉलला नवा उभारीचा मौका
गोव्यातील दोन ठिकाणी होणाऱ्या 'सुपर कप' फुटबॉल स्पर्धेमुळे स्थानिक खेळाडूंना मोठा मंच मिळणार आहे....
By Pooja Patil 2025-09-13 09:57:16 0 120
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 89
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 515
Telangana
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706...
By Vanmoj Suryamohan 2025-12-24 16:40:33 1 316
Andhra Pradesh
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...
By Gadiyapudi Narendra 2026-02-02 13:11:15 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com