Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.

0
235

Andhra

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District

కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత

దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Search
Categories
Read More
Business & Finance
Tripura Expands Bamboo Industry for Rural Growth
Tripura is strengthening its bamboo industry by improving processing facilities, promoting...
By Navya Sree 2026-07-06 07:08:45 0 70
Andhra Pradesh
నిమ్మనపల్లె: బండ్లపై వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లె మండలంలోని బండ్లపై వద్ద శుక్రవారం ఉదయం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌తో...
By Pagadala Venkateswar 2026-05-29 13:03:14 0 92
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 172
Andhra Pradesh
ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-06-27 03:26:37 0 74
Andhra Pradesh
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల...
By Chennaiah Kati 2026-06-28 13:15:21 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com