ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు : కర్నూలు ఎస్పీ

0
189

కర్నూలు : కర్నూలు జిల్లా :

ప్రభుత్వ పథకాల పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు...

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మోసపోవడానికి ప్రధాన కారణం.... అత్యాశ, అశ్రద్ద...మోసగాళ్ళ మాటలు నిజమని నమ్మకండి.

పథకాల పేరుతో వచ్చే  తెలియని  ఫేక్ లింకులను క్లిక్‌ చేయవద్దు.

బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు... జాగ్రత్త!

...డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ !! 

ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మవడి వంటి పథకాల పేరుతో  సోషల్ మీడియాలో  ఫేక్ లింకులను పంపి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు. 

‘ఇది  ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మీకు రూ. లక్షలలో  రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.

ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,  ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. 

ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని , ఫేక్ల్ లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. 

ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
 

డిఐజి ,  జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ గారి  సూచనలు...

- అపరిచిత లింకులను నమ్మవద్దు.

-  ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. 

- వ్యక్తిగత సమాచారం షేర్‌ చేయవద్దు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.

- అపరిచిత కాల్స్‌ వస్తే 1930 నంబరుకు కాల్‌ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.

- ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్‌ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.

- ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్‌లను మాత్రమే ఉపయోగించాలి అని ఒక ప్రకటనలో తెలియజేశారు

Search
Categories
Read More
Puducherry
Puducherry Police Launch Major Crackdown on Underage Driving
The Puducherry Police Department has announced a significant escalation in penalties aimed at...
By Tejaswini Komanduru 2026-06-05 10:55:23 0 369
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 174
Andhra Pradesh
నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు...
By Boya Dasthagiri 2026-04-02 11:14:35 0 293
Delhi - NCR
The City That Never Learns: A Midnight Nightmare in a Moving Fortress
The 2012 echoes returned to Delhi’s streets this Monday as a 30-year-old mother was...
By Dunna Jessicaruth 2026-05-15 08:58:42 0 116
Andhra Pradesh
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
By Boya Dasthagiri 2026-04-20 11:33:56 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com