ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

0
217

*విజయవాడ నగరపాలక సంస్థ*

 

*12-01-2026*

 

*ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి*

 

ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 12 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 2, ఇంజనీరింగ్ 4, పబ్లిక్ హెల్త్ 2, యుసిడి 3, ఎస్టాబ్లిష్మెంట్ 1 మొత్తం కలిపి 12 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి. 

 

*పౌర సంబంధాలు అధికారి*

 

*విజయవాడ నగరపాలక సంస్థ*

Search
Categories
Read More
Andhra Pradesh
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో...
By Ratna Sekhar 2026-02-28 18:16:40 0 1K
Andhra Pradesh
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...
By Eslavath RameshNaik 2026-01-26 07:47:33 0 495
Andhra Pradesh
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
By Pagadala Venkateswar 2026-06-13 10:45:47 0 64
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 138
Andhra Pradesh
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్...
By Gadiyapudi Narendra 2026-03-02 13:47:56 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com