గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.

0
289

Kvsr. Koteswararao. Guntur

 

*గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది: 09.01.2026* _*//100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు,.//*_ 🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 📍 ఈ క్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ Sk.అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిరోధించేందుకు కొత్తపేట సీఐ శ్రీ ఎం. వీరయ్య చౌదరి గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍 నిన్న రాత్రి కొత్తపేట ఎస్‌ఐ శ్రీ ఎన్. రవికిరణ్ రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది (PCs డేగల కోటేశ్వరరావు, వి. జానీ భాష, టి. అనిల్ కుమార్, చ. శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావు) నెహ్రూ నగర్, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో గంజాయి మరియు MDMA డ్రగ్స్ అమ్ముతూ, సేవిస్తున్నారనే సమాచారం మేరకు రైడ్ నిర్వహించారు. 📍 రైడ్‌లో భాగంగా నెహ్రూ నగర్‌కు చెందిన పఠాన్ మున్నా మరియు చిల్లర ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద 100 గ్రాముల లిక్విడ్ గంజాయి మరియు 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. 📍 అరెస్ట్ చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారు ఇద్దరికీ 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. 📍 కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను అమ్మినా, సేవించినా, సరఫరా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ శ్రీ స్కె. అబ్దుల్ అజీజ్ గారు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...
By Boiena Rajesh 2026-03-09 14:26:34 0 142
Telangana
తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో...
By Bittu Bittu 2025-12-24 11:55:22 0 244
Andhra Pradesh
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
By Pagadala Venkateswar 2026-02-20 11:38:17 0 146
Andhra Pradesh
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌...
By Rajini Kumari 2025-12-18 07:40:24 0 125
Andhra Pradesh
కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా
    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-02-14 07:29:29 0 238
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com