రాష్ట్రంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ : కర్నూలు జిల్లా

0
165

కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలోని పెద్ద కడబూర్ పోలీస్ స్టేషన్ రాష్ట్రం లోనే  అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ గా ఎంపికైంది.

డీజీపీ నుండి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ...

 డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, డిఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి.

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. 

2025 వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తమ పోలీసు స్టేషన్ గా కర్నూలు జిల్లా లోని  పెద్దకడుబూరు పోలీసుస్టేషన్ గా ప్రకటించారు. 

ఈ సంధర్బంగా  సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును శుక్రవారం విజయవాడ మంగళగిరిలో ఏపీ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర డీజీపీ శ్రీ హారిష్ కుమార్ గుప్తా ఐపియస్ గారి చేతుల మీదుగా డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్ , పెద్దకడబూరు ఎస్‌ఐ  నిరంజన్ రెడ్డి అందుకున్నారు. 

డీజీపీ వీరిని అభినందించారు. 

జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టా త్మక అవార్డును అందుకోవడం జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణమని కొనియాడారు.

టెక్నాలజీని వినియోగించి లా అండ్‌ ఆర్డర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ సూచించారు. 

డిఐజి , కర్నూలు  జిల్లా ఇన్ చార్జ్  ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ..

 నేరాల అదుపు, నేర నియంత్రణ,  సీసీ కెమెరాలు, త్వరితగతిన కేసుల దర్యాప్తు మొదలైన వాటి వల్ల ఈ అవార్డుకు పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఎంపికైందన్నారు.

పెద్దకడుబూరు పోలీసులు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పరిష్కారం,  సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యల్లో  బాగా చురుగ్గా పనిచేశారన్నారు.

ఈ కారణంగా అవార్డు దక్కింది. 

దేశంలో పది పోలీసు స్టేషన్‌లు ఈ అవార్డులకు ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ కు ఆ ఘనత దక్కిందని ,  కేంద్రం హోం శాఖ అవార్డుకు పెద్దకడుబూరు పోలీసు స్టేషన్‌ ఎంపిక కావటం గర్వంగా ఉంది.

సమష్టి కృషితోనే సాధ్యమైంది అని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు తెలిపారు. 

డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి, ఎమ్మిగనూరు డిఎస్పీ, కోసిగి సిఐ,  పెద్దకడుబూరు ఎస్సై, సిబ్బందికి   పోలీసు ఉన్నతాధికారులు,  జిల్లా పోలీసు యంత్రాంగం  అభినందనలు తెలిపారు.


Search
Categories
Read More
Andhra Pradesh
దోర్నాల వ్యక్తి హత్య
దోర్నాల వ్యక్తి హత్య  మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య...
By Chennaiah Kati 2026-02-17 11:20:24 0 204
Andhra Pradesh
చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులు - రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం హామీల పేరుతో 5కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు
కోడుమూరు వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై...
By mahaboob basha 2025-06-16 15:26:34 0 1K
Andhra Pradesh
హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయం సేవక ్ సంఘం 100 సంవత్సరాలు పూర ్ త ి చేసుకున్ న సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2025-12-22 18:14:09 0 169
Telangana
“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు...
By Sidhu Maroju 2026-03-17 10:28:08 0 152
Andhra Pradesh
గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక...
By KOTESWARARAO KVSR 2025-12-30 15:23:07 0 403
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com