మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు: కమిషనర్

0
161

కర్నూలు : 

మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సచివాలయాల సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం ఆయన ఇండోర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్లను పరిశీలించారు. ఆటలకు అవసరమైన ఏర్పాట్లు, టాయిలెట్లు, తాగునీరు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు రోజూ ఎదుర్కొనే పనిభారం, బాధ్యతల ఒత్తిడిని తగ్గించే దిశగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెలవు దినాలైన శని, ఆదివారాల్లో అన్ని విభాగాల మున్సిపల్ ఉద్యోగులతో పాటు సచివాలయాల సిబ్బందికి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పురుషుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్ వంటి ఐదు రకాల పోటీలు, మహిళల కోసం టెన్నికాయిట్, త్రో బాల్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, షటిల్, రంగోలి వంటి ఏడు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న సంక్రాంతి పండుగ పండుగ నాడు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉద్రిక్తత తగ్గి, శారీరక చురుకుదనం పెరుగుతోందన్నారు. విభాగాల మధ్య సమన్వయం పెరగడంతో పాటు, సహోద్యోగుల మధ్య పరస్పర అవగాహన, సహకార భావం బలపడుతోందని, ఇది కార్యాలయ వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, పని పట్ల నిబద్ధతను పెంచుతోందని తెలిపారు.

కార్యక్రమంలో ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, సచివాలయ సిబ్బంది ఉప్పరి నవీన్, కావ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 250
Andhra Pradesh
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-21 14:44:30 0 100
Telangana
"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్...
By Sidhu Maroju 2026-03-25 07:37:20 0 88
Andhra Pradesh
అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ...
By Pagadala Venkateswar 2026-03-07 05:03:15 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com