కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

0
202

కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,


బాపట్ల: సంక్రాంతి  పండుగ సందర్భంగా కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తెలిపారు.

బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం
 ముద్రించిన కోడి పందాలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్యా నేరమని గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి  పండుగ సందర్భంగా కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్య నేరమని తెలిపారు.  కోళ్లకు కాలికి కత్తులు కట్టడం గాయాలు చేయడం మూగ జీవులకు హాని కలిగించి ఆనందించడం మరియు  మూగజీవాలపై పందేలు కాయడం  నేరం అవుతుందన్నారు. కోడి పందేలు నిర్వహించిన, ప్రోత్సహించిన, పాల్గొనిన వారిపై చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొనబడును. ఈ ఉత్తర్వులు  ఉల్లంఘించిన వారి పై సెక్షన్ 10 - ఆంధ్ర ప్రదేశ్ గేమింగ్ ఆక్ట్ 1974 మరియు సెక్షన్ 34- జంతుహింస నివారణ చట్టం 1960 ల ప్రకారం చట్ట రీత్యా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు.

కోడి పందాలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్యా నేరమని గోడ పత్రికను జిల్లా కలెక్టర్ తో పాటుగా  పశుసంమిధక శాఖ జెడి డాక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ పి.గ్లోరియా, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డి యం.శ్రీలక్ష్మి,కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జున్ రావ్,డి ఎస్ పి.  ఆవిష్కరించారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా...
By Jagadeesh Babu 2026-05-22 15:01:26 0 58
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 350
Andhra Pradesh
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..   ...
By Rajini Kumari 2026-01-14 12:49:30 0 166
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:36:19 0 347
Telangana
MNCL: పదో తరగతి విద్యార్థులకు ALERT
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో...
By Mitappaly Shiavji 2026-01-08 02:00:06 0 369
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com