ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు.

0
221

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 66 మంది యూనిట్, బూత్ ఇంచార్జీలకు నా చేతుల మీదుగా అందజేయడం ఎంతో గర్వంగా అనిపించింది.

నిర్విరామంగా తెలుగుదేశం జెండాను మోస్తూ, పార్టీ విలువలను కాపాడుకుంటూ, సమాజ సేవనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు ఈ గుర్తింపు దక్కడం నిజంగా అభినందనీయం. పని చేయడమే కాదు… ఆ పనికి తగిన గుర్తింపు వచ్చినప్పుడే ఆ సేవకు సార్థకత లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.

ఈ ప్రశంస పత్రాలు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రావడం, అందులో గుంటూరు పశ్చిమం నుంచి ఎక్కువ శాతం రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.

“గుంటూరు వెస్ట్ - ఆల్వేస్ బెస్ట్” అన్నది మరోసారి రుజువైంది.

ఈసారి ప్రశంస పత్రాలు అందుకోని వారు ఉత్తమ కార్యకర్తలు కాదనే భావన ఏమాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా కిందకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉత్తమ కార్యకర్తలే. ‘తొలి అడుగు’ కార్యక్రమంలో చెప్పిన అంశాలను ప్రజల వరకు సమర్థవంతంగా తీసుకెళ్లిన వారికే ఈసారి గుర్తింపు లభించింది.

ఈరోజు ఉత్తమ కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వారిపై ఇకపై రెట్టింపు బాధ్యత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతి రోజూ మన ప్రవర్తనతో, మాటలతో, పార్టీ విలువలను ప్రజలకి చాటిచెప్పాల్సిన అవసరం ఉంది.

మనమంతా ఒక కుటుంబంలా, ఎలాంటి విభేదాలు లేకుండా, ఐకమత్యంతో ముందుకు సాగాలి. అదే ఐకమత్యం గుంటూరు పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.

పార్టీ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ… ప్రజాసేవలో మన ప్రయాణం ఇలాగే కొనసాగుదాం.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi In a special message to...
By BMA ADMIN 2025-05-23 06:52:36 0 3K
Telangana
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్‌ మృతి
వరంగల్‌ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17...
By Bheeshman King 2026-07-08 12:40:21 0 405
Telangana
అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల...
By Sidhu Maroju 2026-01-20 06:40:44 0 232
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 206
Andhra Pradesh
మదనపల్లిలో గృహప్రవేశాలు, ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు గృహప్రవేశ శుభకార్యాలు, బైపాస్ రోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-02-21 04:13:12 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com