ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు.

0
223

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వారు పంపిన ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాలను మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 66 మంది యూనిట్, బూత్ ఇంచార్జీలకు నా చేతుల మీదుగా అందజేయడం ఎంతో గర్వంగా అనిపించింది.

నిర్విరామంగా తెలుగుదేశం జెండాను మోస్తూ, పార్టీ విలువలను కాపాడుకుంటూ, సమాజ సేవనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు ఈ గుర్తింపు దక్కడం నిజంగా అభినందనీయం. పని చేయడమే కాదు… ఆ పనికి తగిన గుర్తింపు వచ్చినప్పుడే ఆ సేవకు సార్థకత లభిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.

ఈ ప్రశంస పత్రాలు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రావడం, అందులో గుంటూరు పశ్చిమం నుంచి ఎక్కువ శాతం రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.

“గుంటూరు వెస్ట్ - ఆల్వేస్ బెస్ట్” అన్నది మరోసారి రుజువైంది.

ఈసారి ప్రశంస పత్రాలు అందుకోని వారు ఉత్తమ కార్యకర్తలు కాదనే భావన ఏమాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా కిందకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉత్తమ కార్యకర్తలే. ‘తొలి అడుగు’ కార్యక్రమంలో చెప్పిన అంశాలను ప్రజల వరకు సమర్థవంతంగా తీసుకెళ్లిన వారికే ఈసారి గుర్తింపు లభించింది.

ఈరోజు ఉత్తమ కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వారిపై ఇకపై రెట్టింపు బాధ్యత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతి రోజూ మన ప్రవర్తనతో, మాటలతో, పార్టీ విలువలను ప్రజలకి చాటిచెప్పాల్సిన అవసరం ఉంది.

మనమంతా ఒక కుటుంబంలా, ఎలాంటి విభేదాలు లేకుండా, ఐకమత్యంతో ముందుకు సాగాలి. అదే ఐకమత్యం గుంటూరు పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.

పార్టీ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ… ప్రజాసేవలో మన ప్రయాణం ఇలాగే కొనసాగుదాం.

Search
Categories
Read More
Andhra Pradesh
అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్
బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు....
By Boiena Rajesh 2026-04-16 13:58:01 0 179
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 201
Andhra Pradesh
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్
Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో...
By Siva Bhaskar 2026-02-02 04:49:42 0 544
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 95
Andhra Pradesh
యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు .
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం...
By John Baji 2026-02-04 13:00:17 0 465
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com