ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్

0
160

కర్నూలు : ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి
 కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియగా ఆర్వో వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చేయడం, మరణించిన వారు, డూప్లికేట్ పేర్లు తొలగించడం, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం, కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ విధంగా రూపొందే ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్వో పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో ఏర్పడే సందేహాలు, అపోహలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహా సూచనలతో నివృత్తి చేసి, ఎన్నికల సంఘం అందించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లేలా సమన్వయంతో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు  ఓటిపిలు అడగరని, గుర్తింపు కార్డుతోనే ఇంటింటికీ వచ్చి ధృవీకరణ చేపడతారని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని, బీఎల్‌వోలు ప్రజల వద్దకు వచ్చినప్పుడు సహకరించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని ఆర్వో కోరారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ కే.వి.సతీష్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, ఎస్‌ఈ రమణ మూర్తి, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 300
Tamilnadu
యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025...
By Sidhu Maroju 2025-09-15 17:10:25 0 254
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 295
Andhra Pradesh
​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.
వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-08 04:57:06 0 117
Andhra Pradesh
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయం
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40...
By Benguluri Madhubabu 2026-03-30 15:13:32 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com