మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
110

*గుంటూరు*

 

*3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

 

*3వ ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ...*

 

• సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషం.

• మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలు.

• తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.

• వందలాది భాషలు ఉన్నా... కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది.. అందులో తెలుగు ఉండడం గర్వకారణం.

• ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు... ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయం.

• కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారు... తెలుగు వైభవం చాటారు.

• వేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచిపోలేం.

• పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలి... తెలుగు భాష ఎక్కడికీ పోదు... శాశ్వతంగా ఉంటుంది.

• అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారు.

• విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి.

• తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేం.

• నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావు.

• తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.

• తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములను మరువలేం.

• రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు... పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూ గుర్తుంటారు.

• ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదు.

• తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి.

• దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మన తెలుగువాడే.

• మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకం.

• అందుకే దేశ భాషలందు తెలుసు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు తెలుగు భాషను కీర్తించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ఓటర్ల దినోత్సవం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా...
By Kothuru Murali 2026-01-25 11:52:37 0 71
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 145
Andhra Pradesh
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం...
By Eslavath RameshNaik 2026-01-21 14:16:32 0 174
Andhra Pradesh
 216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  ...
By Gadiyapudi Narendra 2025-12-24 17:18:07 0 186
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com