శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర : ఎమ్మిగనూరు

0
219

కర్నూలు :  ఎమ్మిగనూరు : 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో  శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర (రథోత్సవం) సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు పట్టణంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నూతన వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన లైటింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రాంతాలు:
• శ్రీనివాస్ సర్కిల్ – SBI – ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు
• సోమేశ్వర సర్కిల్
• మాచాని సోమప్ప సర్కిల్
• అంబేద్కర్ & గాంధీ సర్కిల్
• కర్నూలు బైపాస్ రోడ్డు – నూతన సర్కిల్
• శివ సర్కిల్
• బస్ స్టాండ్ పరిసరాలు
• అన్నమయ్య సర్కిల్

వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే జాతర సందర్భంగా భద్రత, వెలుతురు, రాకపోకలు సజావుగా ఉండేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. జాతరను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు...
By Ratna Sekhar 2026-02-19 20:16:08 0 928
Andhra Pradesh
తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
*తాడేపల్లి:*     *తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఘనంగా77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.*...
By Rajini Kumari 2026-01-26 08:06:07 0 158
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com