ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ముగ్గుల పోటీలు.

0
220

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా నిర్విరామంగా మహిళలను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…

మహిళల ప్రతిభను వెలికి తీసేలా ఇలాంటి పోటీలను నిర్వహించడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రజ్యోతి డీజీఎం శ్రీ రామచంద్రరావు గారికి, అలాగే ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన వికాస్ హాస్పిటల్స్ సీఎండీ శ్రీ గళ్ళా రామచంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముగ్గు అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదని, అది తెలుగు సాంప్రదాయానికి ప్రతీక అని ఎమ్మెల్యే గారు అన్నారు. నేటి తరం ముగ్గు పిండుల నుంచి చాక్‌పీస్‌లు, స్టిక్కర్లు, టైల్స్, పెయింటింగ్‌ల వైపు మళ్లుతున్నా, మన సంప్రదాయాల వెనుక ఉన్న తత్వాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. బియ్యం పిండి, గోధుమ పిండితో వేసే ముగ్గుల ద్వారా చీమలు, కీటకాలకు కూడా తెలియకుండానే దానధర్మం చేస్తున్నామనే భావనను మన పెద్దలు మనకు నేర్పారని గుర్తు చేశారు.

ప్రతి శుభకార్యానికి, ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు అనివార్యమని పేర్కొన్నారు. ఇంతమంది మహిళలు ఎంతో శ్రద్ధతో, సమయం కేటాయించి, ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళ విజేతేనని, భారతీయ సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకే వారు అభినందనీయులని తెలిపారు.

విజేతలుగా ఎంపికైన వారితో పాటు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజేతలుగా నిలవని వారు మరింత ఉత్సాహంతో, పోటీ భావనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మహిళల ద్వారా మన సంప్రదాయాన్ని బతికిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్
మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం...
By Avunoori Mahesh 2026-04-08 10:17:24 0 219
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-15 05:46:28 0 166
Punjab
Punjab's 2026 Education Reforms: Building Better Learning
Punjab's education sector reforms in 2026 focus on enhancing the quality, accessibility, and...
By Fathima Safa 2026-06-16 10:32:46 0 98
Andhra Pradesh
శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా...
By Gadiyapudi Narendra 2026-04-27 07:17:48 0 323
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన
గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి...
By Chennaiah Kati 2026-07-10 16:25:56 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com