కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

0
70

కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమౌతున్న సమయం.. కానీ కోబాల్డ్‌పేటలోని ఓ కుటుంబం మాత్రం ఇవేమీ పట్టనంత పుట్టెడు శోకంలో మునిగి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మద్దు సూరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పూర్తి నిరాశ, నిస్పృహలకు లోనైన ఆ కుటుంబానికి శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కొండంత అండగా నిలిచారు.

స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి బుధవారం స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారిలో మనోధైర్యం నింపారు. కుటుంబ సభ్యులతో మమేకమై స్వాంతన చేకూర్చారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులు, గాయాల తీవ్రత గురించి ఆరా తీసి ఆర్ధిక సాయం అందించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఏకంగా తమ ఇంటికే రావడంతో.. ఆ ఇంట నవ వసంతం ముందే విరిసినట్లైంది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఒక కన్ను అయితే కార్యకర్తలు మరో కన్ను అని వ్యాఖ్యానించారు. అందుకే తమ అధినేత ఇటు కార్యకర్తల క్షేమంతో పాటు అటు ప్రజల సంక్షేమానికి సంయుక్తంగా పెద్ద పీట వేస్తుంటారని తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా తామంతా కూడా కార్యకర్తల కష్టసుఖాలలో ఎళ్ళవేళలా తోడు నీడగా ఉంటున్నట్లు చెప్పారు. నిత్యం జగన్ అడుగుజాడల్లో నడిచే తనకు పార్టీనే కుటుంబమని.. కార్యకర్తలే కుటుంబ సభ్యులని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాపతోటి అంబేద్కర్, దూపాటి వంశీ, వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ నాయకులు ఓర్చు శ్రీనివాసరావు, ఆలా కిరణ్, మాదాసు భాగ్యారావు, సింగు నరసింహారావు, రబ్బానీ, కౌండిన్య, రాయప్ప, విజయ, బోడయ్య, బ్రహ్మం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి చెన్న ముక్క పల్లి లో ఘనంగా ముగిసిన సంక్రాంతి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి గ్రామంలో హిందూ ముస్లింలు ఘనంగా సంక్రాంతి లో భాగమైన...
By Benguluri Madhubabu 2026-01-16 12:59:31 0 211
Andhra Pradesh
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...
By Gadiyapudi Narendra 2026-01-04 16:19:40 0 226
Andhra Pradesh
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....   విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
By Rajini Kumari 2026-01-18 14:19:27 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com