రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు

0
131

 

రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప, వారికి నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. వైసీపి నాయకులు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పై మంగళవారం పత్రికా ముఖంగా చేసిన ఆరోపణలను మేయర్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపి 5ఏళ్ల పాలనను తిరస్కరించి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారాన్నిచ్చారన్నారు. వైసీపి నాయకులు సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసి అడ్డుకోవాలని చూసినా, శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యావంతులు, సంస్కారవంతులని ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తి నేడు గుంటూరు ఎంపిగా గెలిచి, కేంద్ర మంత్రి అయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల అనతి కాలంలోనే గుంటూరు అభివృద్దికి రూ.5 వందల కోట్లు కేంద్ర నిధులను తెచ్చారన్నారు. సదరు నిధులతో రానున్న కాలంలో నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి నందివెలుగు రోడ్డులో ఎంతో కాలంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు, శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డులోని బ్రిడ్జ్ నిర్మాణానికి, పలకలూరు బ్రిడ్జి నిర్మాణానికి మరియు మిర్చ్ యార్డ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని తెలియచేశారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు అన్నివిభాగాల అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తున్నారన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు.

నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాససన సభ్యులు బూర్ల రామాంజనేయులు గుంటూరు రూరల్ మండలంలోని గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారని, సభ్యులు అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ 11 గ్రామాలతో పాటు నగరానికి దగ్గరగా ఉన్న మరో 7 గ్రామాలను కలిపి మొత్తం 18 గ్రామాలను విలీనం చేయుటకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారన్నారు. ముఖ్యమంత్రివర్యులు గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేస్తున్నారని, అలాగే గ్రేటర్ తిరుపతి అని ప్రతిపాదనలు చేస్తున్నారని, వాటికి అనుగుణంగానే గుంటూరు నగరాన్ని కూడా గ్రేటర్ గుంటూరు చేయుటకు నగర పాలక సంస్థకు దగ్గరగా ఉన్న గ్రామాలను విలీనం చేయడానికి ఆమోదం తెలిపామన్నారు. సదరు గ్రామాల్లో ఇప్పటికే త్రాగునీరు, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలూ ఉన్నాయన్నారు. విజయవాడ మరియు వైజాగ్ ల కంటే గుంటూరు నగరం ఎప్పుడో అభివృద్ధి చెందిందని, బ్రిటిష్ కాలంలోనే గుంటూరు నగరంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే గుంటూరు నగరాన్నిరాజధాని అమరావతి నగరానికి ధీటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, గుంటూరు ఎంపి, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ల సహకారంతో గుంటూరు నగరాన్నిసమగ్రాభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 42
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 170
Andhra Pradesh
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...
By Vadlamudi NagaVenkat 2026-04-10 13:12:23 0 125
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Andhra Pradesh
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*   *For scrolls*   *దావోస్:*   *ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...
By Rajini Kumari 2026-01-22 11:59:31 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com