ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం

0
256

ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ఒంగోలులో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన సీతారామాంజనేయ ప్రసాద్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు. యువకుడిగా ఉన్నప్పుడే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గుర్తింపు పొందారు.

2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్‌డీపీటీ) చైర్మన్‌గా ఆయన సేవలందించారు. ఆ సమయంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాల జీర్ణోద్ధరణ చేపట్టడంతో పాటు, పలు ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, దశ సహస్ర సువాసినీ పూజ వంటి విశిష్ట కార్యక్రమాలను నిర్వహించారు.

హిందూ ధర్మ ప్రచార లక్ష్యంతో ‘ధర్మ శంఖారావం’ అనే మాసపత్రికను కూడా ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ‘గాయత్రి పరివార్’ పేరుతో సంస్థను స్థాపించి, అనేక మంది యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఉచిత అన్నదానం, ఉచిత హోమియో వైద్యసేవల వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు...
By Chennaiah Kati 2026-06-22 06:14:53 0 58
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 71
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 146
Rajasthan
Nurse Suicide Sparks Fierce Protests Over 6500 Layoffs
Rajasthan is engulfed in massive protests after the government terminated nearly 6,500...
By Tejaswini Komanduru 2026-06-15 09:22:03 0 123
Telangana
"మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్...
By Sidhu Maroju 2026-04-28 15:37:05 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com