ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం

0
189

గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు.

కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 12 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొన్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. సోమవారం జరిగే కార్యక్రమానికి గత వారం అందిన ఫిర్యాదులు పరిష్కార నివేదికతో అధికారులు హాజరుకవాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. ప్రతి విభాగంలో పిజిఆర్ఎస్, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిఎంసి పిఎంయు బృందం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. 

పిజిఆర్ఎస్ ద్వారా 31 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 7, ఇంజినీరింగ్ విభాగం 11, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగం 1, పరిపాలన విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం ‎ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర...
By Ponnala Srinivasrao 2026-07-16 04:04:12 0 56
Telangana
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ ఇన్ ఛార్జీల నియామకం
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ ఇన్ ఛార్జీల నియామకం* ‎*33 జిల్లాలకు స్టేట్,...
By Ponnala Srinivasrao 2026-05-21 01:31:37 0 116
Andhra Pradesh
శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు...
By Benguluri Madhubabu 2026-03-14 13:39:06 0 183
Telangana
గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి,...
By Malla Rambabu 2026-07-18 05:54:56 0 144
Business & Finance
Protect Your Brand with Trademark Registration Today
A trademark protects your brand's name, logo, slogan, symbol, or unique identity from...
By Navya Sree 2026-07-18 06:27:29 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com