గుంటూరు వాహనదారులు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఆకతాయిలపై గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాటి కట్టిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

0
197

*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 24.12.2025* _*//*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 24.12.2025* _*//వాహనదారులు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రమాదకరంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఆకతాయిలపై గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలను ప్రమాదకర రీతిలో నడుపుతూ, అధిక శబ్దాలు చేస్తూ వాహనదారులు మరియు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీస్ వారికి ఫిర్యాదులు అందాయి. 🔰 ఈ ఫిర్యాదులపై గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జివి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజు (24.12.2025) గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడమైంది. 🔰 ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు ముగిసిన అనంతరం విద్యార్థినులు, మహిళలు రహదారులపై ప్రయాణిస్తున్న సమయంలో, కొంతమంది ఆకతాయిలు ఆకస్మికంగా బ్రేకులు వేయడం, ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం, అతివేగంతో దూసుకెళ్లడం వంటి వికృత చర్యలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. 🔰 ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, అనధికారికంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించి, పలువురు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వాహనాలను సీజ్ చేయడం జరిగింది. 🔰 *వివరాల ప్రకారం :* ▪️ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 17 ద్విచక్ర వాహనాలు ▪️ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 07 ద్విచక్ర వాహనాలు ▪️ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో – 20 ద్విచక్ర వాహనాలు మొత్తం 44 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 👉 రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతూ (ఈవ్ టీజింగ్), ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలు సీజ్ చేస్తామని, ఇలాంటి ప్రత్యేక వాహన తనిఖీలు ప్రతిరోజూ కొనసాగిస్తామని గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. చేపట్టిన పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలను ప్రమాదకర రీతిలో నడుపుతూ, అధిక శబ్దాలు చేస్తూ వాహనదారులు మరియు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీస్ వారికి ఫిర్యాదులు అందాయి. 🔰 ఈ ఫిర్యాదులపై గుంటూరు రేంజ్ గౌరవ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ ఐపీఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జివి రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజు (24.12.2025) గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడమైంది. 🔰 ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు ముగిసిన అనంతరం విద్యార్థినులు, మహిళలు రహదారులపై ప్రయాణిస్తున్న సమయంలో, కొంతమంది ఆకతాయిలు ఆకస్మికంగా బ్రేకులు వేయడం, ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేయడం, అతివేగంతో దూసుకెళ్లడం వంటి వికృత చర్యలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. 🔰 ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, అనధికారికంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించి, పలువురు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వాహనాలను సీజ్ చేయడం జరిగింది. 🔰 *వివరాల ప్రకారం :* ▪️ ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 17 ద్విచక్ర వాహనాలు ▪️ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో – 07 ద్విచక్ర వాహనాలు ▪️ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో – 20 ద్విచక్ర వాహనాలు మొత్తం 44 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 👉 రోడ్లపై వికృత చేష్టలకు పాల్పడుతూ (ఈవ్ టీజింగ్), ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలు సీజ్ చేస్తామని, ఇలాంటి ప్రత్యేక వాహన తనిఖీలు ప్రతిరోజూ కొనసాగిస్తామని గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం : మున్సిపల్ కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-11 09:07:57 0 159
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-12 14:56:07 0 80
Andhra Pradesh
గుంటూరు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో రాష్ డ్రైవింగ్ మరియు బైక్ రేసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది.
గుంటూరు జిల్లా SP శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు East DSP గారు అయిన SK అబ్దుల్...
By KOTESWARARAO KVSR 2025-12-24 17:18:50 0 205
Andhra Pradesh
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ
2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు....
By John Baji 2025-12-30 12:06:24 0 111
Andhra Pradesh
చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర
*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*   *టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*  ...
By Rajini Kumari 2025-12-21 09:13:41 0 308
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com