తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు

0
196

మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అనుమానితుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. వీరన్న హత్యకు కారకులుగా అనుమానిస్తున్న తండాకు చెందిన RMP వైద్యుడు భరత్, బాలు ఇళ్లపై దాడులు చేశారు.  భరత్ కు  చెందిన బైక్, కిరాణా షాప్ను మృతుడి బంధువులు దగ్ధం చేశారు. మరో అనుమానితుడు బాలు ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తండా వాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు తండాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 93
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
*అమరావతి*   గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు   జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ...
By Rajini Kumari 2025-12-13 10:14:45 0 156
Andhra Pradesh
మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి చంద్రబాబు.
AP: ఏడాది క్రితం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా...
By Pagadala Venkateswar 2026-01-24 10:02:36 0 56
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక !!
కర్నూలు : కర్నూలు జిల్లా...•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్...
By Hari Krishna 2025-12-29 10:49:25 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com