మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి షాబుకారి ఉరుసు ఆహ్వానం

0
106

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం.

 

ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించి ఆహ్వానం అందజేసిన ఉరుసు కమిటీ సభ్యులు.

 

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 23.12.2025.

 

కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి మంగళవారం అందజేశారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. ఇస్లాం సంప్రదాయ ప్రకారం శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 60
Telangana
మన దేశం మన ఓటు... అమూల్యమైన ఓటుపై అవగాహన ర్యాలీ... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,...
By Gangaram Rangagowni 2026-01-25 07:08:46 0 115
Bharat Aawaz
Supreme Court: Citizens Filing Complaints Should Not Be Treated Like Criminals
New Delhi - A Landmark Judgment to Protect Your Right to Approach Police Without Fear...
By Citizen Rights Council 2025-07-23 13:32:36 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com