పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన

0
127

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...

 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి NH–565 పై తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

 

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక పెద్దపులి మృతి చెందింది.

 

సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ

 

విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మొత్తం నాలుగు పెద్దపులులు ఉన్నాయని,

అందులో ఒక పులి తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిందని తెలిపారు.

 

పులి మృతితో అటవీశాఖలో కలకలం రేగింది. ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో అటవీశాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

 

అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 344
Andhra Pradesh
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
By Pagadala Venkateswar 2026-03-12 06:33:40 0 122
Andhra Pradesh
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
By Gadiyapudi Narendra 2026-01-23 15:55:43 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com