CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం

0
149

*Press Release*

 

*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*

 

*సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం*  

 

*అమరావతి, డిసెంబర్ 22 :* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ పథకానికి ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి కేంద్రం కుదించిందని, 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలంటే ఏపీ సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని సీఎంతో అన్నారు. అదే విధంగా 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుందని, వెంటనే సవరణలను వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. 

****

Search
Categories
Read More
Andhra Pradesh
అంజుమన్ భూములు ఖాజీ భూములు మసీదు దర్గా భూములు ఇవన్నీ ముస్లిం మైనార్టీ భూములు ఆ తర్వాతే వక్ఫ్ భూములు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా_  _ఇన్ని భూములు ఉండి ముస్లిం...
By John Baji 2026-01-24 08:06:57 0 149
Andhra Pradesh
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశం
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది...
By Benguluri Madhubabu 2026-03-22 07:14:31 0 147
Andhra Pradesh
ప్రజలకు శుభవార్త
రాష్ట్రములో  మంచి శుభ వార్త రాబోతుంది అవి ఏమిటి అంటే వచ్చే ఉగాది పండుగ నాటికి ఐ దు లక్షల...
By Mobbu Venkatramana 2026-01-20 11:14:51 0 531
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com