CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం

0
148

*Press Release*

 

*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*

 

*సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం*  

 

*అమరావతి, డిసెంబర్ 22 :* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ పథకానికి ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి కేంద్రం కుదించిందని, 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలంటే ఏపీ సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని సీఎంతో అన్నారు. అదే విధంగా 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుందని, వెంటనే సవరణలను వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. 

****

Search
Categories
Read More
Telangana
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*   *విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు*...
By Terli Ashok 2026-01-08 03:51:29 0 255
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 156
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 136
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
By Pagadala Venkateswar 2026-03-17 11:42:36 0 88
Telangana
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు...
By Yadamma Raju Gajapaga 2025-12-23 08:02:53 0 439
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com