దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ

0
188

*ప్రెస్ నోట్*

 

*దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*

 

దుబాయ్‌లో నిర్వహించిన తెలుగు వారి ఆత్మీయ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి శ్రీ టి.డి. జనార్దన్ మరియు విక్రమ్ పూల రూపొందించిన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకంతో పాటు దాని ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 

 

ఈ సందర్భంగా శ్రీ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ, 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

 

ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలనా సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాలను, NTR భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసామని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్ పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు పి.వి. రమణ మూర్తి, నల్లూరి శేషయ్య, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల విజయవంతంగా నిర్వహించారు.

 

అలాగే ఎన్‌ఆర్‌ఐ టీడీపీ – యూఏఈ కార్యవర్గానికి చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోతుకూరి, ఉపాధ్యక్షులు నిరంజన్ కాచర్ల, ప్రధాన కార్యదర్శి వాసు పొడిపి రెడ్డి, ట్రెజరర్ రాజా రవి కిరణ్ కోడి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ హరి కల్లూరి, మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ దారపనేని, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూధన్ కల్లూరి, మోహన్ మురళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.
తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది...
By Karapati Gopi 2025-12-28 04:04:44 0 362
Andhra Pradesh
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-06 12:27:27 0 161
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 132
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Telangana
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ...
By Sidhu Maroju 2026-03-29 09:09:57 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com