పల్స్ పోలియో రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అయ్యన్నపాత్రుడు

0
180

 *రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు* 

 

నర్సీపట్నం:

భవిష్యత్ తరాల ఆరోగ్య రక్ష కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని ఏపీ అసెంబ్లీ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్పీకర్ గారు ప్రారంభించగా, వారి సతీమణి, కౌన్సిలర్ పద్మావతి గారు చిన్నారులకు స్వయంగా చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ:

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 28,467 మంది (5 ఏళ్ల లోపు) చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు.

పోలియో చుక్కలు వందశాతం సురక్షితమని, ఎటువంటి అపోహలు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు.

పనులు ఉన్నా అశ్రద్ధ చేయకుండా, "రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ" అని గుర్తించి, దగ్గర్లోని కేంద్రాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Gujarat
Gujarat Adds 6,632 MW Renewable Energy Capacity in 2025 |
Gujarat added 6,632 MW of renewable energy capacity between April and August 2025, bringing total...
By Pooja Patil 2025-09-16 07:56:53 0 198
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ...
By Sidhu Maroju 2026-01-31 09:02:14 0 123
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 2K
Telangana
నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|
హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా...
By Sidhu Maroju 2026-01-28 19:44:38 0 139
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com