పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్

0
242

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ 

 

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు.

 

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పల్స్ పోలియో వంటి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2015 వ సంవత్సరం తర్వాత మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని అందువల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. మన పిల్లలే మన ఆస్తి అని వారిని ఆరోగ్యవంతులుగా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పల్స్ పోలియోతో పాటు టీకాలు కూడా పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

 

కార్యక్రమంలో కార్పోరేటర్

పొట్లూరు సాయిబాబా,పాతూరి సాంబశివరావు,నాదర్ల రాజేష్,కరీమ్, శాయినా బుజ్జి, రెడ్డి రాంబాబు,పోతురాజు, అయ్యప్ప రెడ్డి, కలామ్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న...
By Kothuru Murali 2026-04-21 15:03:17 0 102
Andhra Pradesh
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు...
By Siva Bhaskar 2025-12-25 02:22:39 1 760
Telangana
"తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ...
By Sidhu Maroju 2026-06-17 08:50:19 0 161
Business & Finance
Lower Energy Costs to Boost Uttar Pradesh Businesses
The reduction in electricity tariffs is expected to lower energy expenses for industries, MSMEs,...
By Navya Sree 2026-07-01 05:59:07 0 42
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :ఒంగోలు ట్రిపిల్ ఐటీ కి సదుం విద్యార్థి ఎంపిక.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థి మహమ్మద్ అఫాక్...
By Kothuru Murali 2026-06-30 16:34:20 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com