పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్

0
197

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ 

 

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు.

 

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పల్స్ పోలియో వంటి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2015 వ సంవత్సరం తర్వాత మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని అందువల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. మన పిల్లలే మన ఆస్తి అని వారిని ఆరోగ్యవంతులుగా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పల్స్ పోలియోతో పాటు టీకాలు కూడా పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

 

కార్యక్రమంలో కార్పోరేటర్

పొట్లూరు సాయిబాబా,పాతూరి సాంబశివరావు,నాదర్ల రాజేష్,కరీమ్, శాయినా బుజ్జి, రెడ్డి రాంబాబు,పోతురాజు, అయ్యప్ప రెడ్డి, కలామ్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు నంబరు పూలు కుంటలోని తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-02-07 08:43:01 0 240
Andhra Pradesh
వైసిపి నెయ్యి అంశం పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ పై దుష్ప్రచారం
*ప్రచురణార్థం* *20-02-2026*   *వైసిపి కల్తీ నెయ్యి అంశం ప‌క్క దారిప‌ట్టించేందుకే...
By Rajini Kumari 2026-02-20 23:24:30 0 124
Telangana
విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా...
By Dodla Nagaraju 2026-04-19 13:56:08 0 150
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 15:34:37 0 240
Andhra Pradesh
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు...
By Kothuru Murali 2026-01-29 09:03:52 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com