రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు

0
155

*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….*

 

*“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….*

 

#“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.

#ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

#*జీరో పావర్టీ (Zero Poverty):* ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.  

#*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 

#వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.  

#GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.

 

*(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 00:32:23 0 167
Andhra Pradesh
అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
*అమరావతి లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-26 08:04:12 0 169
Andhra Pradesh
రేపు ప్రజాదర్బార్
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ...
By Gitta Raju 2026-04-16 13:14:25 0 129
Bharat Aawaz
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025 The Reserve Bank of India’s Monetary Policy...
By Bharat Aawaz 2025-08-06 06:17:27 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com