రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు

0
158

*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….*

 

*“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….*

 

#“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.

#ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

#*జీరో పావర్టీ (Zero Poverty):* ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.  

#*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 

#వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.  

#GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.

 

*(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*

Search
Categories
Read More
Andhra Pradesh
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా...
By Boya Dasthagiri 2026-04-03 07:26:24 0 254
Andhra Pradesh
ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం...
By Benguluri Madhubabu 2026-03-21 07:38:07 0 176
Andhra Pradesh
గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు !!
కర్నూలు : గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), కోల్‌కతా.....
By Hari Krishna 2025-12-22 04:13:07 0 181
Telangana
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు...
By Ponnala Srinivasrao 2026-04-30 03:15:43 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com