నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు

0
229

*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*

 

*బలవంతంగా మీటర్ల బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి*

 

*స్మార్ట్ మీటర్ల పై మాట తప్పిన కూటమి ప్రభుత్వం*

 

*ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపు, నేడు బలవంతంగా మీటర్ల బిగింపు*

 

*అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్*

 

*స్మార్ట్ మీటర్లు విద్యుత్ భా రాలపై పోరాటం ఉదృతం*

 

_సిహెచ్ బాబురావు, సిపిఎం

 రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 

 

#నేడు విజయవాడ సిపిఎం

 జిల్లా కార్యాలయంలో జరిగిన

 పత్రికా విలేకరుల

 సమావేశంలో బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు#

 

#బాబురావు,కాశీ నాథ్ మాట్లాడుతూ.....

 

*ప్రతి ఇంటిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల రూపంలో ఆదానీ దోపిడీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది*

 

*ఆంధ్రప్రదేశ్ ను అధానీప్రదేశ్ గా సర్కార్ మారుస్తోంది*

 

*రాష్ట్రములోని రెండు కోట్ల మంది వినియోగదారులకు బాగున్న మీటర్లు తొలగించి, స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది*

 

*స్మార్ట్ మీటర్ల ద్వారా 25 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై కూటమి మోపుతోంది*

 

*కేంద్ర ప్రభుత్వం, మోడీ మెప్పుకోసం, ఆదానీ సంస్థతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నది*

 

*ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ తో సహా టిడిపి, కూటమి నేతలు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారు*

 

*ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించబోమని విద్యుత్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు*

 

*కూటమి మాట తప్పింది, నమ్మకద్రోహం చేసింది, నేడు బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారు*

 

*విజయవాడ నగరంలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్లు బిగించకపోతే మూడు రోజుల్లో విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణం*

 

*దొడ్డిదారిన, మోసగించి, ప్రజల కళ్ళుగప్పి మీటర్ల బిగింపుకు పూనుకుంటున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు, బిగించకపోతే సహించమని హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు*

 

*మీటర్ల రిపేరు సాకుతో స్మార్ట్ మీటర్లు బిగించడం మోసపూరితం*

 

*కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు, సోలార్ కనెక్షన్లకు బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించడం శోచనీయం*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు చట్ట విరుద్ధం, హామీలకు విరుద్ధం*

 

*స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదాని, కార్పొరేట్లకు అప్పగించడానికి, ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి*

 

*ఇప్పటికే కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 24 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం ఇతర రూపాలలో అదనపు భారాలు మోపింది*

 

*మరో 12717 కోట్ల రూ.. ట్రూ అప్ చార్జీల విధింపుకు రంగం సిద్ధం అయ్యింది*

 

*విద్యుత్ స్మార్ట్ మీటర్ కు అయ్యే ఖర్చు 8 వేల నుండి 15 వేల రూ.. వరకు వినియోగదారులపై వేసి 93 నెలలో వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు*

*విధ్యుత్ వ్యయం తగ్గిస్తామని, చార్జీలు, భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు... స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యయం పెంచడం, ప్రజలపై భారం మోపటం మోసపూరితం కాదా?*

 

*ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే ఆదానీ సంస్థ ప్రజల నుండి ముందస్తు చార్జీలు వసూళ్లకు పూను కుంటుంది*

 

*టైమ్ ఆఫ్ ది డే ప్రకారం అధిక విద్యుత్ వినియోగించే సమయంలో యూనిట్ కి అధిక రేట్లు వసూళ్లు వ్యాపార సంస్థల నుండి ఇప్పటికే ప్రారంభించారు*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా ప్రతి వినియోగదారుడు కి గంట గంటకి రేట్లు నిర్ణయించి ప్రజలను దోచుకుంటారు*

 

*ప్రజా పోరాటం వల్ల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆగింది*

 

*రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల నిరసనలతో స్మార్ట్ మీటర్ల బిగింపు నివాసాలకు నిలిచిపోయింది*

 

*ప్రజల కళ్ళుగప్పి పలుచోట్ల మోసపూరితంగా బిగించడానికి ప్రభుత్వం అదానీ సంస్థ మళ్లీ కుట్రలు ప్రారంభించాయి*

 

*ప్రజలు అప్రమత్తంగా ఉండి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి*

 

*ఎక్కడకక్కడ ప్రతిఘటించాలి, తిప్పి కొట్టాలి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలి*

 

*ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి స్మార్ట్ మీటర్ల పై స్పందించాలి*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి*

 

*ఇప్పటికే విద్యుత్ రంగంలో బొగ్గు కాంట్రాక్టులు, విదేశీ బొగ్గు దిగుమతి, పోర్టుల ద్వారా రవాణా, లారీ ట్రాన్స్పోర్ట్, సోలార్ విద్యుత్ ఒప్పందాలు, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు మొత్తం అదానీ సంస్థ కైవసం చేసుకున్నది*

 

*విద్యుత్ రంగాన్ని కబళిస్తున్నది, మోడీ ప్రభుత్వం అండతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదానీప్రదేశ్ గా మార్చుతున్నారు*

 

*పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిమెంటు రంగం ఇతర అనేక రంగాల్లో అదాని సంస్థ గుత్తాధిపత్యం వహిస్తున్నది*

 

*ఇండిగో విమాన సంక్షోభం ద్వారా కార్పొరేట్ల గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమో దేశానికి అర్థమయ్యింది*

 

*అయినా బిజెపి, మోడీ, ఎన్ డి ఏ సర్కార్ ఏకపక్షంగా ఆదాని, కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నారు*

 

*రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్రానికి వత్తాసు పలికి, అదానీకి లొంగిపోయారు*

 

*రాష్ట్రంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి బడా సంస్థలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వం లొంగిపోయింది*

 

*2024లో ఎన్నికలకు ముందు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు ఎలక్టరాల్ బాండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించింది*

 

*గతంలో వైసిపి ప్రభుత్వం ఆదానీ సంస్థ నుండి ముడుపులు తీసుకుని ఏడువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందానికి పూనుకున్నది*

 

*కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. అదాని, శిరిడీసాయి ఎలక్ట్రికల్ సంస్థలకు పూర్తిగా దాసోహం అంటున్నాయి*

 

*రాష్ట్ర ప్రజలను బలి తీసుకుంటున్నాయి, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నాయి*

 

*శాశ్వతంగా విద్యుత్ భారాలు మోపి, స్మార్ట్ మీటర్ల ద్వారా అదానీ కబంధహస్తాల్లో రాష్ట్రాన్ని, వినియోగదారులను బిగిస్తున్నారు*

 

*ఈ ప్రమాదాన్ని గమనించి ప్రజలందరూ ఉద్యమించాలి, పాలకులను నిలదీయాలి*

 

*సిపిఎం, వామపక్షాలు ప్రజలందరితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి*

 

*స్మార్ట్ మీటర్లను అడ్డుకోవాలి, తిప్పి కొట్టాలి*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి, పెట్టిన మీటర్లు తొలగించాలి, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేయాలి*

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Preserves Rich Tribal Culture and Heritage
Arunachal Pradesh continues to preserve and promote its rich tribal culture and heritage through...
By Fathima Safa 2026-07-06 09:09:58 0 168
Andhra Pradesh
విజయవాడ అంటేనే విద్యల వాడ ఎంపీ కేసినేని శివనాథ్
*ప్రెస్ నోట్*   *30-5-2026*   *విజయవాడ అంటేనే విద్యలవాడ - ఎంపీ కేశినేని శివనాథ్*...
By Rajini Kumari 2026-05-30 11:52:39 0 113
Business & Finance
MMR Retains Position as India’s Largest Housing Market
The Mumbai Metropolitan Region (MMR) has remained India's largest residential real estate market...
By Navya Sree 2026-06-30 06:45:05 0 36
Andhra Pradesh
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా : * నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు...
By Hari Krishna 2026-01-18 11:45:11 0 169
Andhra Pradesh
60 మందికి బోటు మత్స్యకారులకు బోటు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*   నాగాయలంక మండలం...
By Rajini Kumari 2026-04-10 12:03:29 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com