నేడు విజయవాడ సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొన్నారు

0
114

*విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్ల తొలగిస్తామని సర్కార్ నోటీసులు*

 

*బలవంతంగా మీటర్ల బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి*

 

*స్మార్ట్ మీటర్ల పై మాట తప్పిన కూటమి ప్రభుత్వం*

 

*ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపు, నేడు బలవంతంగా మీటర్ల బిగింపు*

 

*అదానికి దాసోహం అంటున్న కూటమి సర్కార్*

 

*స్మార్ట్ మీటర్లు విద్యుత్ భా రాలపై పోరాటం ఉదృతం*

 

_సిహెచ్ బాబురావు, సిపిఎం

 రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 

 

#నేడు విజయవాడ సిపిఎం

 జిల్లా కార్యాలయంలో జరిగిన

 పత్రికా విలేకరుల

 సమావేశంలో బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు#

 

#బాబురావు,కాశీ నాథ్ మాట్లాడుతూ.....

 

*ప్రతి ఇంటిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల రూపంలో ఆదానీ దోపిడీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది*

 

*ఆంధ్రప్రదేశ్ ను అధానీప్రదేశ్ గా సర్కార్ మారుస్తోంది*

 

*రాష్ట్రములోని రెండు కోట్ల మంది వినియోగదారులకు బాగున్న మీటర్లు తొలగించి, స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది*

 

*స్మార్ట్ మీటర్ల ద్వారా 25 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై కూటమి మోపుతోంది*

 

*కేంద్ర ప్రభుత్వం, మోడీ మెప్పుకోసం, ఆదానీ సంస్థతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను బలి చేస్తున్నది*

 

*ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ తో సహా టిడిపి, కూటమి నేతలు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చారు*

 

*ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించబోమని విద్యుత్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు*

 

*కూటమి మాట తప్పింది, నమ్మకద్రోహం చేసింది, నేడు బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారు*

 

*విజయవాడ నగరంలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్లు బిగించకపోతే మూడు రోజుల్లో విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణం*

 

*దొడ్డిదారిన, మోసగించి, ప్రజల కళ్ళుగప్పి మీటర్ల బిగింపుకు పూనుకుంటున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు, బిగించకపోతే సహించమని హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు*

 

*మీటర్ల రిపేరు సాకుతో స్మార్ట్ మీటర్లు బిగించడం మోసపూరితం*

 

*కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు, సోలార్ కనెక్షన్లకు బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించడం శోచనీయం*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు చట్ట విరుద్ధం, హామీలకు విరుద్ధం*

 

*స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదాని, కార్పొరేట్లకు అప్పగించడానికి, ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి*

 

*ఇప్పటికే కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 24 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం ఇతర రూపాలలో అదనపు భారాలు మోపింది*

 

*మరో 12717 కోట్ల రూ.. ట్రూ అప్ చార్జీల విధింపుకు రంగం సిద్ధం అయ్యింది*

 

*విద్యుత్ స్మార్ట్ మీటర్ కు అయ్యే ఖర్చు 8 వేల నుండి 15 వేల రూ.. వరకు వినియోగదారులపై వేసి 93 నెలలో వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు*

*విధ్యుత్ వ్యయం తగ్గిస్తామని, చార్జీలు, భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు... స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యయం పెంచడం, ప్రజలపై భారం మోపటం మోసపూరితం కాదా?*

 

*ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే ఆదానీ సంస్థ ప్రజల నుండి ముందస్తు చార్జీలు వసూళ్లకు పూను కుంటుంది*

 

*టైమ్ ఆఫ్ ది డే ప్రకారం అధిక విద్యుత్ వినియోగించే సమయంలో యూనిట్ కి అధిక రేట్లు వసూళ్లు వ్యాపార సంస్థల నుండి ఇప్పటికే ప్రారంభించారు*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా ప్రతి వినియోగదారుడు కి గంట గంటకి రేట్లు నిర్ణయించి ప్రజలను దోచుకుంటారు*

 

*ప్రజా పోరాటం వల్ల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆగింది*

 

*రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల నిరసనలతో స్మార్ట్ మీటర్ల బిగింపు నివాసాలకు నిలిచిపోయింది*

 

*ప్రజల కళ్ళుగప్పి పలుచోట్ల మోసపూరితంగా బిగించడానికి ప్రభుత్వం అదానీ సంస్థ మళ్లీ కుట్రలు ప్రారంభించాయి*

 

*ప్రజలు అప్రమత్తంగా ఉండి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి*

 

*ఎక్కడకక్కడ ప్రతిఘటించాలి, తిప్పి కొట్టాలి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలి*

 

*ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి స్మార్ట్ మీటర్ల పై స్పందించాలి*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి*

 

*ఇప్పటికే విద్యుత్ రంగంలో బొగ్గు కాంట్రాక్టులు, విదేశీ బొగ్గు దిగుమతి, పోర్టుల ద్వారా రవాణా, లారీ ట్రాన్స్పోర్ట్, సోలార్ విద్యుత్ ఒప్పందాలు, ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు మొత్తం అదానీ సంస్థ కైవసం చేసుకున్నది*

 

*విద్యుత్ రంగాన్ని కబళిస్తున్నది, మోడీ ప్రభుత్వం అండతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదానీప్రదేశ్ గా మార్చుతున్నారు*

 

*పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిమెంటు రంగం ఇతర అనేక రంగాల్లో అదాని సంస్థ గుత్తాధిపత్యం వహిస్తున్నది*

 

*ఇండిగో విమాన సంక్షోభం ద్వారా కార్పొరేట్ల గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమో దేశానికి అర్థమయ్యింది*

 

*అయినా బిజెపి, మోడీ, ఎన్ డి ఏ సర్కార్ ఏకపక్షంగా ఆదాని, కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నారు*

 

*రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్రానికి వత్తాసు పలికి, అదానీకి లొంగిపోయారు*

 

*రాష్ట్రంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి బడా సంస్థలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వం లొంగిపోయింది*

 

*2024లో ఎన్నికలకు ముందు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు ఎలక్టరాల్ బాండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించింది*

 

*గతంలో వైసిపి ప్రభుత్వం ఆదానీ సంస్థ నుండి ముడుపులు తీసుకుని ఏడువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందానికి పూనుకున్నది*

 

*కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. అదాని, శిరిడీసాయి ఎలక్ట్రికల్ సంస్థలకు పూర్తిగా దాసోహం అంటున్నాయి*

 

*రాష్ట్ర ప్రజలను బలి తీసుకుంటున్నాయి, విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నాయి*

 

*శాశ్వతంగా విద్యుత్ భారాలు మోపి, స్మార్ట్ మీటర్ల ద్వారా అదానీ కబంధహస్తాల్లో రాష్ట్రాన్ని, వినియోగదారులను బిగిస్తున్నారు*

 

*ఈ ప్రమాదాన్ని గమనించి ప్రజలందరూ ఉద్యమించాలి, పాలకులను నిలదీయాలి*

 

*సిపిఎం, వామపక్షాలు ప్రజలందరితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి*

 

*స్మార్ట్ మీటర్లను అడ్డుకోవాలి, తిప్పి కొట్టాలి*

 

*స్మార్ట్ మీటర్ల బిగింపు పై ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలి, పెట్టిన మీటర్లు తొలగించాలి, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేయాలి*

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు అభివృధి కోసమే రాజకీయాలు !!
కర్నూలు సిటీ : కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి టీజీ భరత్.. రాష్ట్ర...
By Hari Krishna 2025-12-14 13:52:58 0 210
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-10 11:21:45 0 111
Bharat Aawaz
Mumbai Senior Doctor Trapped in “Digital Detention” & Swindled of ₹3 Crore
A 70-year-old doctor from Mumbai was tricked into believing her bank accounts were frozen due to...
By Citizen Rights Council 2025-06-28 12:45:55 0 1K
Andhra Pradesh
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
By Chennaiah Kati 2026-01-18 07:08:21 0 127
Andhra Pradesh
పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:39:04 0 815
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com