కాలినడకన వెళ్లే భవానిల ఆగ్రహం ఆవేదన

0
159

ఆదివారం రాత్రి 9.40-9.50 సమయం.

 

 

నగరంలో అన్ని రోడ్ల మీద భవానీలు కాలి నడకన ఇంద్రకీలాద్రి వైపు వెళుతున్నారు. లో బ్రిడ్జి, కంట్రోల్ రూమ్ ఫ్లై ఓవర్ మీదుగా పాతబస్తీలోకి రాకపోకలు నిలిచిపోయాయి.

 

పాతబస్తీలోకి వెళ్ళే వాహనాలు అన్నీ రైల్వేస్టేషన్ వైపుగా ఎర్రకట్ట వైపు వచ్చాయి.

 

కొన్ని వాహనాలు ఖుద్దుస్ నగర్ నుంచి ఎర్రకట్ట వైపు వచ్చాయి. BRTS రోడ్డు, ప్రభాస్ కాలేజ్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఎర్రకట్ట ప్రారంభంలో పోగు అయ్యాయి. 

 

భవానీ దీక్షల విరమణ కోసం గిరి ప్రదక్షణ జరుగుతూ ఉండటంతో పాతబస్తీ వైపు వాహనాలు నియంత్రిస్తున్నారు.

 

ఈ క్రమంలో ఎర్రకట్ట దగ్గర వందల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మరో మార్గంలో వెళ్ళాలి అని పోలీసులు అడ్డుకోవడంతో ఎటు వెళ్లాలో తెలియక అరగంట పాటు వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

 

నగరంలోని మిగిలిన ప్రాంతాల నుంచి పాతబస్తీలోకి కనెక్టివిటీ మార్గాలు అన్నీ మూసి వేయడంతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే చలి గాలిలో పిల్లలతో బళ్ల మీద ఉన్న వారు ఉన్నారు.

 

ట్రాఫిక్ పోలీసులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా హార్న్ మోగిస్తూ జనం నిరసనకు దిగారు. దాదాపు ఐదు నిమిషాల పాటు వాహనాలు అన్నీ హారన్ మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

 

జనంలో ఆగ్రహాన్ని చూసిన ట్రాఫిక్ పోలీస్ SI పై అధికారులకు పరిస్థితి వివరించడంతో వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. 

 

ఈ ఘటన నగరంలో పాతబస్తీ ప్రాంతానికి ప్రత్యామ్నాయ కనెక్టివిటీ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద ఫ్లై ఓవర్ ప్రతిపాదన 25ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. ఎర్రకట్ట విస్తరణ జరగడం లేదు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర...
By Kothuru Murali 2026-03-09 08:01:33 0 83
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 78
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
By John Baji 2026-01-02 12:46:13 0 126
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న...
By Sidhu Maroju 2026-02-21 15:08:02 0 134
Andhra Pradesh
ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు సద్వినియోగం చేసుకోండి డాక్టర్ సుధ డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకోండి రామకృష్ణ వివేకానంద రెడ్డి
*తాడేపల్లి*   *ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని 9 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు...
By Rajini Kumari 2025-12-30 10:14:46 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com