లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం

0
273

కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లు విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతఙ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్‌
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్‌” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
By Ponnala Srinivasrao 2026-04-25 05:34:07 0 74
Manipur
Echoes for Peace: Catholic Bodies Appeal for Harmony
Amidst a fresh wave of violence, Catholic lay organizations in the Archdiocese of Imphal issued a...
By Dunna Jessicaruth 2026-05-15 10:25:55 0 53
Telangana
వరంగల్‌లో హిందూశక్తి ప్రదర్శన… చికోటి ప్రవీణ్ పిలుపు”.|
హైదరాబాద్ : వరంగల్ లో శ్రీరామనవమి సందర్భంగా హిందూ సంకల్ప బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ...
By Sidhu Maroju 2026-03-29 09:09:57 0 146
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com