లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం

0
246

కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లు విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతఙ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
By Pagadala Venkateswar 2026-01-22 14:34:59 0 119
Andhra Pradesh
PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన...
By Pagadala Venkateswar 2026-03-17 03:58:40 0 98
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 114
Andhra Pradesh
పుంగనూరు: పనుల వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో జరుగుతున్న పంచాయతీ పనుల వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో గఫూర్...
By Kothuru Murali 2026-03-24 08:12:09 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com