మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|

0
124

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆల్వాల్ ఆప్కారి (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రజల భద్రత, చట్టం మరియు న్యాయం పరిరక్షణలో ఎక్సైజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కొత్త స్టేషన్ ప్రారంభంతో అక్రమ మద్యం రవాణా, వినియోగంపై మరింత కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో అధికారులు సమర్థంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో.. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి, అల్వాల్–మల్కాజ్‌గిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్‌.ఐ లు కుమార స్వామి, సంధ్య రాణి, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు,     కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగ్ రావు, అలాగే నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, అరుణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మైనార్టీ ఆస్తులపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేతలు.
అంజుమన్ కి సబదించినినా ఈ భూమి ఎన్నో దశాబ్దాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు, విద్యా-సామాజిక...
By John Baji 2025-12-23 11:24:50 0 183
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 79
Andhra Pradesh
Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి.
మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు...
By Pagadala Venkateswar 2026-02-26 11:29:00 0 80
Telangana
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే...
By Vanmoj Suryamohan 2026-01-13 15:03:09 0 277
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 194
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com