ఎదురెదురుగా వాహనాలు డి - తప్పిన ప్రాణ నష్టం.|

0
151

సికింద్రాబాద్.. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్ స్టాప్ సమీపంలో తెల్లవారుజామున రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ వైపుకు ప్లాస్టిక్ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ బోల్తా కొట్టింది.. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుండి వేగంగా దూసుకురావడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద అదుపుతప్పి ఎదురుగా ఉన్న థార్ వాహనాన్ని డీ కొట్టింది. ఈ ఘటనలో తార్ వాహనం నుజ్జునుజ్జయింది. కంటైనర్ డ్రైవర్ సంజయ్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ వాహనం బోల్తాపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం
చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా...
By Gadiyapudi Narendra 2026-02-12 17:18:31 0 108
Andhra Pradesh
మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం
*విద్యాధరపురం మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను అడ్డుకున్న వెలంపల్లి*   *44వ డివిజన్...
By Rajini Kumari 2026-01-28 12:49:41 0 103
Telangana
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్ నూతన...
By Veeresh Kumar 2026-03-25 03:21:15 0 143
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com