వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి

0
278

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్సై చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు మూడు రోజులపాటు జరుపుకునే వారన్నారు. ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజులపాటు జరుపుకుంటామని నిర్వాకులు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు , పోలీసు సిబ్బందికి సహకరించి మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. దీంతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు /మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్...
By mahaboob basha 2025-08-31 01:00:07 0 117
Telangana
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
By Sidhu Maroju 2025-08-18 15:48:45 0 436
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 872
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 925
Telangana
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
                  మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-08-18 16:31:05 0 411
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com