వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి

0
582

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్సై చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు మూడు రోజులపాటు జరుపుకునే వారన్నారు. ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజులపాటు జరుపుకుంటామని నిర్వాకులు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు , పోలీసు సిబ్బందికి సహకరించి మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. దీంతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు /మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Like
1
Search
Categories
Read More
Telangana
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:40:14 0 209
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 2K
Andhra Pradesh
రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.
AP: గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జనవరి 25న మధ్యాహ్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ...
By Pagadala Venkateswar 2026-01-24 06:27:36 0 129
Telangana
పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని...
By Sidhu Maroju 2026-02-21 14:38:35 1 354
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com